1, ఆగస్టు 2010, ఆదివారం

భరతమాత

గుర్రం జాషువ


సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల
యంకసీమల నిల్చినట్టి సాధ్వి

కమలనాభుని వేణుగానసుధాంబుధి
మునిగి తేలిన పరిపూతదేహ

కాళిదాసాది సత్కవికుమారుల గాంచి
కీర్తి గాంచిన పెద్దగేస్తురాలు

బుధ్ధాది మునిజనంబుల తపంబున మోద
బాష్పముల్విడిచిన భక్తురాలు

సింధు గంగానదీజలక్షీరమెపుడు
గురిసి బిడ్డల బోషించుకొనుచునున్న

పచ్చి బాలెంతఋలు మా భరతమాత
మాతలకు మాత సకలసంపత్సమేత.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి