2, ఆగస్టు 2010, సోమవారం

పద్యానికి యతి ప్రాసలే హృద్యం, హృదయమూ....

పద్యానికి యతి, ప్రాస.. హృద్యం,ప్రాణం,అందం.. ఇవి ఏదోవిధంగా పెట్టడం కాదు. సరిగా ఉండాలి. అప్పుడే పద్యం అందగిస్తుంది. తిక్కన సోమయాజి తన నిర్వచనోత్తర రామాయణం లో (1-7)... యతి ప్రాసల గురించి ఇలా చెప్పాడు.
తెలుగు కవిత్వము చెప్పందలచిన కవి యర్ధమునకు దగి యుండెడు మాటలు గొని వళులం బ్రాసంబులు నిలుపక యొగిని బులిమి పుచ్చుట చదురే!
తిక్కన ఎంత చక్కగా చెప్పడో చూడండి. పులమొద్దు అంటున్నదు. కనుక యతి ప్రాసలు ఏవో వేసేసి పద్యాన్ని లాగించెయ్యడం సరి కాదు. అర్ధవంతం గా ఉండాలి. అలాగే వేరొక చోత "ప్రాసము ప్రకారం వేరగు నక్షరంబులన్ శృత్య రూప మంచు నిడ" అన్నాడు. దాని అర్ధం ఏమిటంటె.. బండి "ఱ" మామూలు "ర" పలకడానికి వొకే విధంగా ఉన్నయి కదా అని ప్రాస లో వాడడం సరి కాదు అని సున్నితం గా ప్రభోదించాడు. అలాగే పెద్దలు వాడారు కదా అని మనం వాడడం కూడ సబబు కాదు అని పరవస్తు చిన్నయ సూరి "ఆర్య వ్యవహారంబులు దౌష్త్యంబులు గ్రాహ్యంబునగు" అన్నడు.
కనుక యతి ప్రాసలకు పనికి వచే పదాలు తెలుసుకోంది అర్ధవంతం గా వాడండి. ఒకే పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి కదా? మీకు ఒకే పదాన్ని అన్ని గణాలకు పనికి వచ్చే విధంగా ఎలా ఉపయోగించాలో రేపు చెప్తాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి