2, ఆగస్టు 2010, సోమవారం

యతి, ప్రాస యతుల వివరణ.

ఈ నాలుగు రోజుల సమయం లో మీరు గణ విభజన గురించి, యమాతారాజభానసలగం గురించి అధ్యయనం చేసి ఉంటారనుకుంటాను. ఇక యతుల గొడవ ఏంటో చూద్దాము.
పద్యం లోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతికి పద్యం లో ఏదో ఒక నిర్దేశిత అక్షరం తో యతి కుదరాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఒక విరామ చిహ్నం గా భావించాలి. ఏక బిగిన పద్యం చదవకుండా, ఎక్కడో ఒక చోట విరామ చిహ్నంగా ఆపుదలకు, పద్యం అందగించడానికి పెద్దలు ఏర్పరచిన నియమం ఇది.
ఇక అక్షరాల మధ్యన ఉండే యతి మైత్రి చూద్దాము. ఒక గుణింతం తీసుకుని ఆ ప్రకారం యతి మైత్రి ని గమనించ వచ్చు.
క గుణింతం తీసుకుంటే....
క, కా, కై, కౌ ల మధ్యన యతి మైత్రి ఉంది.
కి, కీ, కె, కే ల మధ్యనా..
కు, కూ, కొ, కో. ల మధ్యనా మైత్రి చెల్లును.
ఈ క్రింది యతి మిత్రులు కూడా గమనించండి.
1. అ, ఆ, ఐ, ఔ, య, హ...
2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ, ౠ
3. ఉ, ఊ, ఒ, ఓ
4. క, ఖ, గ, ఘ
5.చ,ఛ,జ,ఝ, శ, ష, స.
6. ట, ఠ, ద, ధ,
7, ప, ఫ,బ, భ, వ.
8.త, థ, ద, ధ
9.న, ణ, ఙ.
10, ల, ర, ళ .
ఈ అక్షరాల మధ్యన యతి మైత్రి ఉంది కాబట్టి, పద్యం లో నియమిత స్తానం లో ఈ అచ్చు, లేక హల్లుతో గూడిన అక్షరాలను వాడాలి. అవి ఎలాగో వచ్చే పోస్టింగు లో చెప్తాను. ఈ లోపు మీరు ఈ యతి మైత్రుఅలను గుర్తుపెట్టుకోడానికి ప్రయత్నిస్తారు గదా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి